బిగ్ బ్రేకింగ్ : ‘జవాన్’లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా ? అంటే.. అవుననే అంటున్నారు. ప్రస్తుతం ‘పఠాన్’ హిట్ కిక్కులో ఉన్నారు షారుక్. గత నెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. రూ. 1000 కోట్లకు చేరువగా పఠాన్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే.. తన తదుపరి సినిమా ‘జవాన్’ సూపర్ స్టార్ ఫోకస్ చేశారు.

కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. షారుక్ కి జంటగా నయనతార నటిస్తున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ? ఇటీవల అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలిశారట. జవాన్ లో గెస్ట్ రోల్ కోసం అడిగినట్లు సమాచారం. అందుకు బన్నీ ఓకే చెప్పారని టాక్. దీంతో బాలీవుడ్ బాద్ షా తో కలిసి బన్నీ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఖాయం అయింది అంటున్నారు.


ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సుకుమార్ – బన్నీ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’ సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనూ బంపర్ కలెక్షన్స్ అదరగొట్టింది. అన్నింటికంటే ముంచి పుష్ప మేనరిజం ‘తగ్గేదేలా.. ‘ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో జవాన్ లో బన్నీ గెస్ట్ రోల్ స్పెషల్ గా ఉండబోతుంది అంటున్నారు.