తారకరత్నకు తారక్ నివాళులు

నందమూరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. హార్ట్ స్ట్రోక్ తో గత 23 రోజులుగా బెంగళూరు హృదయాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు నందమూరి తారకరత్న శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు తరలించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.

తారకరత్న మృతి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాన్, మహేష్ బాబు, అలీ, అల్లరి నరేష్ .. తదితరు సంతాపం తెలిపారు. నందమూరి హీరోలు జూ. ఎన్ టీఆర్, కళ్యాణ్ రామ్ తారకరత్న పార్థివదేహానికి నివాళులు అర్పించారు.