రస్మిక స్పెషల్

నేషనల్ క్రష్ రష్మిక మందన తన అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. ముంబైలో నిర్వహించిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న రష్మిక.. బ్లాక్ కలర్ డ్రెస్ లో మెస్మరైజ్ చేసింది. ఆమె అందాలకు బాలీవుడ్ జనాలు కూడా ఫిదా అయిపోయారు.

ఇక రష్మిక కెరీర్ విషయానికొస్తే.. కిర్రాక్ పార్టీ (2018) తో తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత మరో రెండు సినిమాలు చేసిన తర్వాత ‘ఛలో ‘సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అదే ఏడాది గీత గోవిందం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రష్మికకు రాలేదు. మహేష్ బాబు (సరిలేరు నీకెవ్వరు), అల్లు అర్జున్ (పుష్ప) లతో నటించింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇక సుల్తాన్ తో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ఈ ఏడాది వారిసు/వారసుడు తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకుంది. బాలీవుడ్ లోనూ రష్మిక హవా మొదలైంది. గుడ్ బై సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ తో కలిసి నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యానిమల్, పుష్ప 2 చిత్రాల్లో నటిస్తోంది.