విరూపాక్ష సెట్ లో పవన్.. టీజర్ అదిరిపోయిందని కితాబు !

కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజు – సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. రేపు (మార్చి 1) టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ కానుందనే వార్తలు వినిపించాయి.

అయితే పండుగ ఒకరోజు ముందుగానే వచ్చినట్లు ఈరోజే పవన్ విరూపాక్ష సెట్ లో ప్రత్యక్షం అయ్యారు. అంతేకాదు.. టీజర్ ను చూసేశారు. పవన్ కు విరూపాక్ష టీజర్ బాగా నచ్చింది. వెంటనే చిత్రబృందాన్ని అభినందించారు. పవన్ సెట్ లో సందడి చేసిన ఫోటోలను తేజు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడీ.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సముద్రఖని దర్శకత్వంలో తేజు నటిస్తున్న సినిమాలో పవన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు.