రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం.. పలువురికి గాయాలు !

హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది.

కాన్వాయ్ లోని ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో కాన్వాయ్‌లోని ఒక కారులో ప్రయాణిస్తున్న పలువురు మీడియా రిపోర్టర్లకూ గాయాలయ్యాయి. లోకల్ మీడియా ప్రతినిధులకు గాయాలు అయినట్టు సమాచారం.రేవంత్‌రెడ్డికి చెందిన 4 కార్లతో పాటు 2 న్యూస్‌ ఛానళ్ల కార్లు ధ్వంసం అయ్యాయి. ప్రమాద తీవ్రతకు కార్లలోని బెలూన్లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.