సమంతతో టచ్ లో రానా

స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దాని నుంచి సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే నాగ చైతన్యతో విడాకుల తర్వాత అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ సమంత తో టచ్ లో ఉంటుందా ? అనే డౌటు అనుమానాలు కలుగక మానదు. అక్కినేని కుటుంబం గురించి తెలియదు. కానీ దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి హీరో రానా దగ్గుబాటి సమంతతో టచ్ లోనే ఉన్నారట. వీలు చిక్కినప్పుడల్లా ఆమెతో మాట్లాడుతుంటారట. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటారట. ఈ విషయాన్ని స్వయంగా రానానే చెప్పారు. 


బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి రానా నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ యాక్షన్‌, క్రైమ్‌ డ్రామాకు కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ వర్మ దర్శకత్వం వహించారు. మెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌ ఇది. ఇందులో సుర్వీన్‌ చావ్లా, సుశాంత్‌ సింగ్‌, ఆశిష్‌ విద్యార్థి, గౌరవ్‌ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో పాల్గొన్న రానా.. సమంత తో టచ్ లో ఉన్నానని చెప్పుకొచ్చారు.