ప్రైమ్ & సింప్లీ సౌత్‌ లో ‘బలగం’ స్ట్రీమింగ్

ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్నిఅందుకున్న సినిమా బలగం. వేణు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు  నిర్మాత. ఈ చిన్న సినిమాకు పెద్ద ప్రచారం  నిర్వహించారు దిల్ రాజు. ఆ ఫలితం కలెక్షన్ల రూపంలో కనిపించాయి. అయినా ఓటీటీ రిలీజ్ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయలేదు.

‘బలగం’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఇవాళ అర్థారాత్రి 12 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ , సింప్లీ సౌత్‌ లో స్ట్రీమింగ్ కానుంది. ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు సింప్లీ సౌత్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఈ సినిమాలో తెలంగాణ పల్లె జీవనాన్ని, మనుషుల మధ్య బంధాలను ఆవిష్కరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. థియేటర్‌లో విశేషంగా అలరించిన ఈ చిత్రం ఓటీటీలో అదరగొట్టడం ఖాయం అంటున్నారు.