మరికాసేపట్లో రాహుల్‌ గాంధీ ప్రెస్ మీట్ !

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి రెండేళ్ల జైలు శిక్ష పడటం.. ఈ నేపథ్యంలో ఆయనపై లోక్ సభ సచివాలయం అనర్హత ప్రకటించడం చకచకా జరిగిపోయిన సంగతి తెలిసిందే.  కేంద్రం తీరుపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇది బీజేపీ కుట్ర, చీకరోజు అంటూ మండిపడుతున్నాయి. 

ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీ  ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అనర్హత వేటుపై రాహుల్‌ ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. అనర్హతపై రాహుల్‌ నిన్న ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘నేను దేశ ప్రజల వాణిని వినిపించేందుకు పోరాడుతున్నాను. ఎంత మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. మరి ఇవాళ మీడియా సాక్షిగా బీజేపీపై యుద్ధం ప్రకటిస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది.