బండి సంజయ్‌కు మరోసారి సిట్ నోటీసులు

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న సిట్‌ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

వాస్తవానికి ఇది వరకే బండి సంజయ్ సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న సిట్ ముందు హాజరు కావాలని కోరింది. అయితే పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున హాజరు కాలేనని బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

పేపర్ లీకేజీ వ్యవహారంలో సర్కార్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని బండి సంజయ్ , రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారం అంతా మంత్రి కేటీఆర్ ఆఫీస్ నుంచి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఓకే మండలానికి చెందిన ఎక్కువ మందికి 100 కు పైగా మార్కులు వచ్చాయని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తోంది. తగిన ఆధారాలు ఇవ్వకుంటే.. వారిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.