బండి సంజయ్ కు బెయిల్ మంజూరు

టెన్త్ పేపర్ లీకేజీ కేసులో అరెస్టైన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కు బెయిల్ మంజూరైంది. హన్మకొండ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. రూ. 20 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. 7 గంటల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత బెయిల్ మంజూరైంది. దీంతో రేపు సంజయ్ బయటికి రానున్నారు.


ఇటీవల వరుసగా లీకవతున్న టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ హస్తం ఉంది. హిందీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టైన ప్రశాంత్ బండి సంజయ్ తో చాటింగ్ చేశాడు. ఫోన్ కాల్స్ మాట్లాడారు. సంజయ్ సూచనల మేరకే ప్రశాంత్ పేపర్ లీక్ చేశారనే అభియోగాలతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంజయ్ ను ఏ1గా పేర్కొన్నారు. అయితే తాజాగా సంజయ్ కు హన్మకొండ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను ఇచ్చింది.