ప్రభాస్-ప్రశాంత్ నీల్.. ఓ పౌరాణికం !

ప్రభాస్ కు సంబంధించిన మరో సినిమా ప్రకటన వచ్చింది. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ‘సలార్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న సలార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే వీరి కాంబోలో మరో సినిమా రాబోతుందని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఇప్పటికే స్కిప్ట్ పూర్తయింది. ఈ సారి ప్రభాస్ కోసం పౌరాణిక కథని ప్రశాంత్ నీల్ రెడీ చేశారని చెప్పారు.

ఇక సలార్ విషయానికొస్తే.. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ లో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. బహుశా.. ఆదిపురుష్ థియేటర్స్ లో సలార్ టీజర్ ను ప్రదర్శించే అవకాశాలు ఉండొచ్చు.