థ్రిల్లింగ్ మ్యాచ్.. గుజరాత్ గెలుపు !

ఐపీఎల్-16 లో థ్రిల్లింగ్ మ్యాచ్. పంజాబ్-గుజరాత్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (36) టాప్ స్కోరర్. జితేశ్‌ శర్మ (25)  సామ్‌ కరన్‌ (22), షారూఖ్‌ ఖాన్‌ (22), భానుక రాజపక్స (20) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్‌ శర్మ రెండు, షమి, లిటిల్‌, అల్జారీ జోసెఫ్‌, రషీద్ ఖాన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఈ టార్గెట్ జీటీ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆఖరి ఓవర్ లో 7 పరుగులు కావాలి. క్రీజులో మిల్లర్ (15), గిల్ (67) పరుగులతో ఉన్నారు. అయితే అద్భుతమైన బాల్ తో గిల్ ను క్లీన్ బోల్డ్ చేశాడు. దీంతో ఆఖరి 2 బంతుల్లో జీటీకి 4 పరుగులు అవసరం కాగా.. 5వ బంతికి తెవాటియా ఫోర్ కొట్టి విజయాన్ని అందించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్, రబాడ, హర్ ప్రీత్, సామ్ కరణ్ తలో వికెట్ పడగొట్టారు.