ప్రైమ్ లో ‘రావణాసుర’ స్ట్రీమింగ్

మాస్ మహారాజా రవితేజ అభిమానులకు సడన్ సప్రైజ్ ఇచ్చారు. ఆయన తాజా చిత్రం ‘రావణాసుర’ ఓటీటీలోకి వచ్చేసింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఈ నెల 7న థియేటర్స్ లో రిలీజ్ అయింది. నెగెటివ్‌ పాత్రలో రవితేజ తన నటనతో ఆదరగొట్టాడు. 

ఇప్పుడీ.. ఈ సినిమా నెల తిరక్కుండానే ఓటీటీ బాట పట్టింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రమోషనల్ హడావుడి లేకుండా రావణసురని ఓటీటీలోకి తీసుకురావడం విశేషం. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరోయిన్లుగా నటించారు.  అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్ల పై అభిషేక్‌ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించారు.