నన్ను తిట్టిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీనే పతనమవుతోంది

ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తనని 91 సార్లు నిందించింది. అయితే నన్ను నిందించిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీనే పతనమవుతోంది అన్నారు ప్రధాని మోడీ. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయాధక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై పై విధంగా స్పందించారు. దుర్భాషలాడే పని కాంగ్రెస్‌ను చేసుకోనివ్వండి. తాను మాత్రం కర్ణాటక ప్రజల కోసం పనిచేస్తా. వారి నిందలకు ప్రజలు ఓట్లతో బదులిస్తారని ప్రధాని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ విష సర్పం లాంటివారు. ఆయన తెచ్చిన పథకాలు చూసేందుకు ఆకర్షణీయంగా ఉన్నాయని రుచి చూస్తే చావు తప్పదని ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజాగా స్వయంగా ప్రధాని కౌంటర్ ఇచ్చారు.