ఓటీటీలోకి ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’.. ఇకపై ఫ్రీగా !

మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, జయం రవి, త్రిష, కార్తి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’. ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. అయితే అది అద్దె ప్రాతిపదికన. ఇకపై అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లందరూ ఉచితంగా చూడొచ్చు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

ఏప్రిల్‌ 28న ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. చోళ యువ‌రాజు అరుణ్‌మొళి వ‌ర్మ అలియాస్ పొన్నియిన్ సెల్వ‌న్ (జ‌యం ర‌వి) త‌న‌పైకి వ‌చ్చిన శ‌త్రుమూక‌లతో పోరాడుతూ స‌ముద్రంలో మునిగిపోవ‌డంతో తొలి భాగం క‌థ ముగుస్తుంది. అస‌లు 9వ శ‌త‌కంలో చోళ సామ్రాజ్యంలో ఏం జరిగింద‌నేది రెండో భాగం సినిమాలోని క‌థ‌గా చూపించారు.