దంచికొట్టిన గిల్, జైస్వాల్.. విండీస్ పై భారీ విజయం !


విండీస్ తో తొలి టీ20 మ్యాచ్ లో ఓటమి పాలైన టీమిండియా బౌన్స్ బ్యాక్ అయ్యింది. శనివారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో హెట్‌మయర్ (61) షై హోప్‌ (45) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్ 3, కుల్‌దీప్ యాదవ్ 2, అక్షర్‌ పటేల్, ముకేశ్ కుమార్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఇక 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 17 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. యువ ఓపెనర్లు  శుభ్‌మన్ గిల్ (77)  యశస్వి జైస్వాల్ (84*) దంచి కొట్టారు. మొదటి నుంచి ఎటాకింగ్ గేమ్ తో ఆకట్టుకున్నారు. విజయానికి చేరువకి వచ్చిన తర్వాత గిల్ అవుటైనా.. తిలక్ వర్మ 7 తో కలిసి జైస్వాల్ పని పూర్తి చేశాడు. ఈ విజయంతో సిరీస్ 2-2 అయింది. ఆఖరి మ్యాచ్ లో గెలిచిన జట్టు కప్ ను ఎగిరేసుకుపోనుంది.