4 రోజులు.. రూ. 500 కోట్లు

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్ల (గ్రాస్) క్లబ్ లో చేరిపోయింది. కోలీవుడ్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో జవాన్ తెరకెక్కింది. నయనతార కథానాయిక. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. దీపికా పదుకొనె స్పెషల్ నెంబర్ తో అలరించింది. 

కథని చెప్పడంలో అట్లీ మరోసారి మాస్టర్ అనిపించుకున్నాడు. జవాన్ కథను తనదైన శైలిలో ప్రజెంట్ చేస్తూనే.. షారుక్ అభిమానులను అలరించే అన్ని అంగులు సినిమాలు చూపించారు. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్ అదిరిపోయాయి. పలు షేడ్స్ ఉన్న పాత్రలో షారుక్ ఒదిగిపోయిన తీరు అద్భుతం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పఠాన్ బ్లాక్ బస్టర్  హిట్ తర్వాత అంతుకుమించిన విజయాన్ని జవాన్ అదించింది. ఒకే ఏడాదిలో రూ. 500 కోట్ల క్లబ్ లో పఠాన్, జవాన్ సినిమాలు చేరడం విశేషం. అది కూడా సినిమా రిలీజైన వన్ వీక్ దాటక ముందే ఈ ఫీట్ ను సాధించడం గమనార్హం.


ఒక్క నాలుగో రోజు రికార్డు స్థాయిలో 28,75,961 జవాన్ టికెట్లు అమ్ముడుపోయాయి. హిందీలో 15404 షోస్ పడగా..  ₹ 76.07  కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. తమిళ్ లో 918 షోస్ పడగా.. రూ. 5.59 కోట్లు వసూలు అయ్యాయి. తెలుగులోనూ 798 జవాన్ షోస్ పడ్డాయి. రూ. 3.44 కోట్లు కలెక్ట్ అయ్యాయి. మొత్తంగా నాలుగో రోజు జవాన్ రూ 85.10 కోట్లు వసూలు చేసింది. ఇదే ఊపు కొనసాగితే.. జవాన్ రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరపోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.