వారికోసం బన్నీ రూ. 25లక్షల సాయం

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి పెద్ద మనసు చాటుకొన్నాడు. శ్రీకాకుళం తిత్లీ తుఫాన్ బాధితుల కోసం రూ. 25లక్షలు విరాళంగా ప్రకటించారు. ‘తిత్లీ తుఫాన్ ఎంద‌రో జీవితాల్లో విషాదం నింపిందని తెలిసి బాధపడ్డాను. అందుకే వారికి నా వంతు బాధ్య‌త‌గా విరాళం అందిస్తున్నా. మీరు కూడా మీకు తోచినంత సాయం చేసి ఇబ్బందుల‌లో ఉన్న వారిని ఆదుకోండి’ అంటూ బన్నీ పిలుపునిచ్చారు. ఇక, ఇప్పటికే టాలీవుడ్ నుంచి సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కొరటాల శివ.. తదితరులు తిత్లీ బాధితుల కోసం తమ వంతుగా సాయం అందించిన సంగతి తెలిసిందే.

ఇక, ‘నా పేరు సినిమా’ తర్వాత బన్నీ మరో సినిమాని మొదలెట్టలేదు. ఆయన తదుపరి సినిమా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఉండాల్సి ఉంది. ఐతే, పూర్తి స్క్రిప్టు అనుకొన్నట్టుగా రాకపోవడంతో ఆలస్యం అవుతోంది. ఇంతలో బన్నీ నిర్ణయం మార్చుకొన్నాడు. ఆయన తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండనుంది. ఆ తర్వాతే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా ఉండనుందనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఇక, దసరా పండగరోజున బన్నీ ఆయన సతీమణి స్నేహారెడ్డి అమ్మమ్మగారిట్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.