సోనాలిని పరామర్శించిన మహేష్


మహేష్ బాబు – సోనాలి బింద్రే జంటగా నటించిన ‘మురారి’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కృష్ణవంశీ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇప్పటికీ టీవీల్లో ప్రసారమైన టీఆర్పీ రేటింగ్స్ అదిరిపోవాల్సింది. ఇందులో మహేష్ – సోనాలీ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కురిదింది. మహేష్ కచ్చితంగా స్టార్ అవుతాడని నిరూపించిన సినిమా ఇది. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ గా మహేష్ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం సోనాలి బింద్రే మాత్రం క్యాన్సర్ తో బాధపడుతూ అమెరికాలో చికిత్స పొందుతుంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో విహారయాత్ర చేస్తున్న మహేష్ ఫ్యామిలీ సోనాలీ బింద్రేను కలిశారు. ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్‌ తెలిపారు. ‘సోనాలి దృఢమైన మహిళ. చికిత్స పొందుతున్నప్పటికీ ఆమె ఫిట్‌గా ఉన్నారు. త్వరలో మామూలు జీవితాన్ని గడిపేందుకు సిద్ధంగా ఉన్నారు. సోనాలితో కలిసి కాసేపు సరదాగా గడిపాను. చాలా విషయాలను మాట్లాడుకున్నాం. తన అనారోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలను నాకు చెప్పారు. తాను బలంగా ఉండటానికి ఏం చేస్తున్నారో కూడా వెల్లడించారు. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటానని సోనాలికి చెప్పా’నన్నారు.

అంతేకాదు.. ‘సోనాలీని మరోసారి కలవాలనుకున్నాను. మేమిద్దరం కలిసి సెంట్రల్‌ పార్క్‌లో వాకింగ్‌ చేయాలనుకున్నాం. కానీ పని నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది. త్వరలో సోనాలిని మళ్లీ కలుస్తానని, సెంట్రల్‌ పార్క్‌లో వాకింగ్‌కి వస్తానని తనకు మాటిచ్చా’నని తెలిపారు నమ్రతా. నమ్రతతో పాటు మహేష్ కూడా సోనాలీని కలిసి ఉంటారని ఆయన అభిమానులు చెప్పుకొంటున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు బయటికొస్తే ఇంకా బాగుణ్ను అని అంటున్నారు.
నాలిని మళ్లీ కలుస్తానని, సెంట్రల్‌ పార్క్‌లో వాకింగ్‌కి వస్తానని తనకు మాటిచ్చాను