మహాకూటమి లెక్క తేలింది

తెలంగాణలో మహాకూటమి లెక్క తేలింది. సీట్ల పంపకం ముగిసింది. తెలంగాణలోని మొత్తం 119 స్థానాలకు గానూ.. కాంగ్రెస్ 91, టీడీపీ 14, టీజెఎస్ 6, సీపీఐ 4 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ నెల 8న అభ్యర్థుల జాబితాని ప్రకటించనుంది. వాస్తవానికి గురువారమే తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితాని ప్రకటించాల్సి ఉంది. ఐతే, అన్ని పార్టీలు కలిసి ఈ నెల 8న అభ్యర్థుల జాబితాని ప్రకటించాలని నిర్ణయించారు. ఇక, గురువారం ఢిల్లీలో రాహుల్ గాంధీ-చంద్రబాబుల భేటీ మహాకూటమిలో నూతనోత్సాహం నింపింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏర్పాటైన ఈ మహాకూటమి.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కలిసి పని చేయనుందని చెబుతున్నారు.