కాస్త కష్టంగా దక్కిన విజయం


టెస్టు, వన్ డే లో ఎలా ఉన్నా టీ20ల్లో పులి వెస్టిండీస్. భారీ హిట్టర్స్, ఆల్ రౌండర్స్ ఆ జట్టు సొంతం. పొట్టిక్రికెట్ లో ప్రపంచంలోని ఏ జట్టుకైనా షాకిచ్చే బలం ఉన్న జట్టు. ఆదివారం ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో విండీస్..భారత్‌ కు షాకిచ్చేంత పని చేసింది. మొదటి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. అలెన్‌ 27 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3/13 కృనాల్‌ పాండ్యా 1/15 వికెట్లు పడగొట్టారు. అనంత బ్యాటింగ్ దిగిన భారత్ తడబడుతూ లక్ష్యాన్ని చేధించింది. ఓ దశలో 45/4 పరుగులతో కష్టాల్లో పడింది. దినేశ్‌ కార్తీక్‌ 31నాటౌట్‌, మనీశ్‌ పాండే 19 పరుగులతో రాణించడంతో.. 17.5ఓవర్లలో టీమిండియా లక్ష్యాన్ని చేధించింది.