టీడీపీ తొలి జాబితా వచ్చేసింది

తెలంగాణలో మహాకూటమి సీట్ల సర్థుబాటు ఓ కొలిక్కి వచ్చింది. దీంతో కూటమిలోని పార్టీలు అభ్యర్థులని ప్రకటించే పనిలో పడ్దాయి. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్, టీడీపీలు అభ్యర్థుల తొలి జాబితాని విడుదల చేశాయి. టీడీపీ 9మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించింది. ఒక సీటుకు ఒకే పేరు పరిశీలనలో ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించామని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ తెలిపారు.

టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా :

1. ఖమ్మం – నామా నాగేశ్వరరావును

2. వరంగల్ పశ్చిమ – నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి

3. సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య

4. మక్తల్ – దయాకరరెడ్డి

5. శేరిలింగంపల్లి – భవ్య ఆనంద ప్రసాద్‌

6. మహబూబ్‌నగర్‌ – ఎర్రశేఖర్‌

7. ఉప్పల్ – వీరేందర్‌గౌడ్‌

8. మలక్ పేట్ – ముజఫర్ అలీ

9. అశ్వారావుపేట – మచ్చా నాగేశ్వరరావు