అభిమానుల ‘కోరిక తీర్చిన దీప్-రణ్’ !

బాలీవుడ్ కొత్త పెళ్లి జంట దీపికా పదుకొనె-రణ్ వీర్ సింగ్ లు అభిమానుల కోరిక తీర్చారు. ఇటలీలోని లేక్‌ కోమోలో వీరి వివాహం కొంకణి, సింధి సంప్రదాయాల్లో అట్టహాసంగా జరిగింది. గురువారం పెళ్లి వేడుక సమయంలో తీసిన ఫొటోలను రణ్‌వీర్‌, దీపిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసి అభిమానులను, సినీ ప్రముఖులను సర్‌ప్రైజ్‌ చేశారు.

వీరి పెళ్లి ఫోటోలు బయటికిరాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నారు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా దీప్ – రణ్ ల పెళ్లి ఫోటోల కోసం కామెంట్స్ చేయడం మొదలెట్టారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా దీప్ రణ్ పెళ్లి ఫోటోల కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన ఓ రెండు ఫోటోలని దీపికా, రణ్ వీర్ తమ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ‘దీప్‌వీర్‌’ జంటకు సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.