తమన్నా రాత్రికి ముహూర్తం పెట్టేసింది !

మిల్కీ బ్యూటీ తమన్నా రాత్రికి ముహూర్తం పెట్టేసింది. యంగ్ హీరో సందీప్ కిషన్ తో కలిసి రొమాన్స్ చేయబోతుంది. వీరిద్దరు జంటగా నటిస్తున్న చిత్రం ‘నెక్ట్స్ ఏంటీ’. బాలీవుడ్ దర్శకుడు కునాల్‌ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈరోజు రాత్రి 8గంటలకి ఈ సినిమా టీజర్ ని విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చెబుతూ తమన్నా ట్విట్ చేసింది. రొమాంటిక్ మూడ్ లో ఉన్న పోస్టర్ ని పోస్ట్ చేసింది. ఇటీవల విడుదల టీజర్ లో సందీప్-తమ్మూల రొమాన్స్ హైలైట్ గా నిలిచింది.

ఈ నేపథ్యంలో రాత్రికి రాబోయే ట్రైలర్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ తో ఏ రేంజ్ లో రెచ్చిపోనుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ లో నవదీప్, పూనమ్ కౌర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లియోన్‌ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం తమ్మూ తెలుగు క్వీన్, ఎఫ్ 2 సినిమాల్లో నటిస్తోంది. ఐతే, చాన్నాళ్ల తర్వాత తమ్మూ యంగ్ తో రొమాన్స్ లోకి దిగుతుండటం విశేషం. చైతూ, రామ్.. తదితర యంగ్ హీరోల తర్వాత ఆ అవకాశం సందీప్ కిషన్ కి దక్కింది.