#మీటూ : ప్రీతి జింటాని తగులుకొన్నారు


సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటాకు ఇంకా ఆ అనుభవం కలగలేదట. ఇప్పటి వరకు ఆమెని ఎవరు లైంగికంగా వేధించలేదట. దానికి ఆమె తెగ ఫీలవుతోంది. తనకి ఆ అనుభవం ఉంటే బాగుండేది. ఏంచక్కా ఆ అనుభవాన్ని మీతో పంచుకునేదాన్ని అంటోంది. ఇటీవల బాలీవుడ్‌ హంగామా యూట్యూబ్‌ చానల్‌ కి ప్రీతి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమెకు మీకు #మీటూ లాంటి అనుభవం ఎదురైందా ? అన్న ప్రశ్న ఎదురైంది. దానికి ప్రీతి ఇచ్చిన సమాధానం షాక్’కి గురిచేస్తోంది.

‘నాకు అలాంటి అనుభవం లేదు. ఒకవేళ ఉన్నా బాగుండేది. మీ ప్రశ్నకు జవాబు దొరికి ఉండేది’ అని నవ్వేసింది. ‘మనం ఎలా ఉండాలని కోరుకుంటామో.. ఎదుటి వ్యక్తి మనల్ని చూసే విధానం కూడా అలాగే ఉంటుంది. నాకైతే ఎప్పుడూ అలాంటి అనుభవం ఎదురవలేదు. బాలీవుడ్‌ ఇండస్ట్రీ మహిళలకు చాలా శ్రేయస్కరమైనది. కొంతమంది పబ్లిసిటీ కోసం ఏమైనా మాట్లాడేస్తున్నారు’ అని నీతులు చెప్పే ప్రయత్నం చేసింది. ఐతే, ప్రీతి సమాధానంపై నెటిజన్స్ మండిపడుతున్నారు.

మరీ.. నెస్‌వాడియా సంగతేంటీ ? అని ప్రశ్నిస్తున్నారు. ‘కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు’ ప్రీతి సహ యజమాని అన్న సంగతి తెలిసిందే. 2014లో ఓ మ్యాచ్‌ సందర్భంగా వ్యాపారవేత్త నెస్‌వాడియా తనతో అనుచితంగా ప్రవర్తిచాడంటూ ప్రీతి ఫిర్యాదు చేసింది. నాలుగు యేళ్లుగా కొనసాగిన ఈ కేసుని గత నెలలోనే పోలీసులు క్లోజ్ చేశారు. తనకు కలిగిన అనుభవాన్ని అంతా దాచుకొని.. అసలు లైంగిక వేధింపులు అంటే ఏంటీ ? అన్నట్టుగా ప్రీతి మాట్లాడటం నెటిజన్స్ కి నచ్చలేదు. అందుకే ఆమెని తగులుకొన్నారు.