గుడ్ న్యూస్ : పవన్ నుంచి పొలిటికల్ థ్రిల్లర్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి గుడ్ న్యూస్. పవన్ నుంచి మరో సినిమా రాబోతుంది. సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ చేసిన పవన్ త్వరలో ఓ సినిమా చేయబోతున్నారని, ఎన్నికల ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న పట్టుదలతో ఉన్నాడని సమాచారమ్.

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్’లో త్రిముఖ పోటీ ఉండబోతుంది. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొననుంది. ఈ మూడు పార్టీల్లో టీడీపీ, వైసీపీ ఎన్నికల ప్రచార అస్త్రాలుగా ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’ లని రెడీ చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకి ముందు ఈ సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి లబ్ధి పొందాలని ప్లాన్ చేసుకొంటున్నాయి.

ఈ నేపథ్యంలో పవన్ కూడా అలెర్ట్ అయ్యారు. జనసేన ఎన్నికల ప్రచార అస్త్రంగా ఓ సినిమాని రెడీ చేయాలని భావిస్తున్నారు. నిర్మాత రామ్‌ తాళ్లూరి పవన్‌ కోసం ఓ కథ సిద్ధం చేయిస్తున్నారట. ఇదో పొలిటికల్ థ్రిల్లర్ అని తెలిసింది. బాబీ, డాలీలలో ఒకరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఇందులో పవన్‌ కాకుండా మరో మెగా కథా నాయకుడు కూడా కనిపిస్తారని తెలుస్తోంది. సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌ల్లో ఒకరు పవన్‌తో పాటు తెరపై కనిపించే అవకాశాలున్నాయట.

పవన్ పాత్ర సెకాంఢాఫ్ లో వస్తుంది. కథకు ఆయన పాత్రే కీలకమని సమాచారం. ఈ కథలో రాజకీయాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తారట. పవన్ పాత్ర అదిరిపోయేలా ఉండబోతుంది. పవన్ వేయబోతున్న పొలిటికల్ సటైర్స్ కి టీడీపీ, వైసీపీ గూబగూయిమనడం ఖాయం అంటున్నారు.