‘కవచం’ విడుదల ఎప్పుడంటే ?


దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కవచం’. మరో హీరోయిన్ గా మెహ్రీన్ నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేటుని ఫిక్స్ చేసుకొంది. డిసెంబర్ 7న సినిమాని విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ డేటు పోస్టర్ ని విడుదల చేసింది.

థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇన్నాళ్లు మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్స్ చిత్రాల్లో శ్రీనివాస్ కనిపించారు. అవి ఆయనకి హిట్స్ ని తెచ్చిపెట్టలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఆయన థ్రిల్లర్ సబ్జెక్ట్ ని ఎంచుకొన్నారు. ఇందులో హర్షవర్ధన్ రాణే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక, ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల వేదికపై సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కాజల్ ని కిస్ చేయడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బెల్లకొండ సినిమాలోనూ కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.