సైరా, సాహో ఒకేరోజు విడుదల !


టాలీవుడ్ లో ప్రస్తుతం సెట్స్ మీదున్న భారీ బడ్జెట్ చిత్రాలు సైరా, సాహో ఒకే రోజు విడుదల కాబోతున్నట్టు సమాచారమ్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ 151 ‘సైరా’ తెరకెక్కుతోంది. తొలి తరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. దాదాపు రూ. 200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్, జగపతి.. తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘సైరా’ ఆగస్టు 15కి వాయిదా పడిందని చెప్పుకొంటున్నారు.

ఇక, అదే రోజు ప్రభాస్ ‘సాహో’ రాబోతుందని చెప్పుకొంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రమిది. సుజీత్ దర్శకుడు. దాదాపు రూ. 200కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. బాహుబలి రేంజ్ లో తెలుగు, తమిళ్,హిందీ బాషల్లో విడుదల చేయబోతున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఈ యాక్షన్ థ్రిల్లర్ ఉండబోతుందని చెబుతున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రదా కపూర్ నటిస్తోంది. వచ్చే యేడాది వేసవిలోప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 15 విడుదల కాబోటున్నట్టు సమాచారమ్. నిజంగానే చిరు, ప్రభాస్ పోటీకి దిగుతారా.. ? ఇద్దరిలో ఒకరు ముందుకు లేదా వెనక్కి వెళతారా ? అనేది చూడాలి.