2.ఓ : 4రోజుల్లో.. 400కోట్లు !

శంకర్ ‘2.ఓ’ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చిన 2.ఓ మెగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకొంది. కలెక్షన్లు ఆ రేంజ్ లోనే ఉన్నాయి. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 100కోట్లు కలెక్ట్ చేసింది. నాలుగు రోజుల్లోనే రూ. 400కోట్లపైగా కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఇప్పుడీ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక, 2.ఓ కలెక్షన్స్ సునామీ ఇప్పట్లో ఆగేలా లేదు.

ఈ విజువల్ వండర్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటించారు. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. దాదాపు రూ. 543భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఐతే, రూ. 375కోట్ల మేర ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో మరో రూ. 180 కోట్లు కలెక్ట్ చేస్తే సరిపోద్ది అని చెప్పుకొన్నారు. ఇప్పుడా కలెక్షన్స్ ని చిట్టి దాటేశాడు. ఇక చిట్టి సేఫ్. లాభాలు ఎంత తీసుకొస్తాడు ? అనేది మాత్రమే మిగిలివుంది. ప్రస్తుతం రికార్డులు బ్రేక్ చేసే పనిలో చిట్టి ఉన్నాడు. ఫైనల్ ప్రాఫిట్ ఎంత అనేది త్వరలోనే తేలనుంది.