కాజల్’కి తీవ్ర అస్వస్థత.. లేవలేని పరిస్థితుల్లో !

స్టార్ హీరోయిన్ కాజల్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆమె భయంకరమైన వ్యాధితో బాధపడుతుందట. ఈ యేడాది ప్రారంభంలో మూడ్నెళ్లపాటు మంచానికే పరితమైందట. లేవలేని పరిస్థితుల్లో చిన్న బ్రేక్ తీసుకొందట. వినడానికి షాకింగ్ అనిపించినా.. ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ నే చెప్పింది. అమె నటించిన తాజా చిత్రం ‘కవచం’. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్.. తన అనారోగ్యం గురించి బయటకి చెప్పింది.

‘ఈ యేడాది ప్రారంభంలో ‘ఆటో-ఇమ్యూన్ డిజార్డర్’తో బాధపడ్డాను. హఠాత్తుగా రోగనిరోధక శక్తి తగ్గిపోయి, ఊహించని విధంగా జ్వరం, ఒళ్లు నొప్పులు వచ్చేయడం ఈ రోగ లక్షణం. మూడు నెలలు అస్సలు లేవలేకపోయా. పూర్తిగా మంచానికే పరిమితమైపోయాను. అప్పటికే ఒప్పుకున్న సినిమాల వల్ల ఎక్కువగా రెస్ట్ తీసుకోలేకపోయా. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నా. ఐతే, అప్పటిలా విశ్రాంతి లేకుండా సినిమాలు చేయలేను. విశ్రాంతి తీసుకొంటూ నెమ్మదిగా సినిమాలు చేస్తా’నని తెలిపింది కాజల్. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బెల్లకొండ శ్రీను సినిమాలోనూ కాజల్ నే హీరోయిన్. ఇక, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఇండియన్ 2’ కోసం కాజల్ ని హీరోయిన్ గా తీసుకొన్నారు. కాజల్ చేతిలో ఉన్న ఒకే ఒక్క బిగ్ ప్రాజెక్ట్ ఇది. ఈ వయసులోనూ ఇటు యంగ్ హీరోలు, అటు సీనియర్ స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం కాజల్ కే దక్కిందని చెప్పాలి.