బాక్సింగ్ డే టెస్టు : ఫాలో ఆన్’లో ఆస్ట్రేలియా

బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ని 151 ప‌రుగులకే కట్టడి చేసింది. దీంతో ఆసీస్ ఫాన్ లో ఆన్ లో పడింది. బూమ్రా ప‌దునైన ఫేస్ తో ఆసీస్ బ్యాటింగ్ ను దెబ్బ‌తీశాడు. ఆరు వికెట్లు పడగొట్టాడు. జ‌డేజా రెండు, ష‌మీ, ఇషాంత్ చెరో వికెట్ తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కి 292 పరుగుల ఆధిక్యం లభించింది.

ఆసీస్ ఫాలో ఆన్ లో ఆసీస్ ఉన్న‌ప్ప‌టికీ భార‌త్ త‌న రెండో ఇన్సింగ్స్ ను ప్రారంభించింది. బహుశా మరో వంద పరుగులు చేసి.. ఆసీస్ ముందు 400 పరుగుల టార్గెట్ ని ఉంచేందుకు ప్లాన్ చేసినట్టు కనబడుతోంది. ఇక, భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్ల న‌ష్టానికి 443 ప‌రుగులు చేసి డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.