విజయం ముగింట టీమిండియా


మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజ‌యానికి చేరువవుతోంది. 399 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ 135 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 54పరుగులతో నాలుగో రోజు ఆటని ప్రారంభించిన కోహ్లీ సేన 8 వికెట్ల నష్టానికి 106పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. దీంతో ఆసీస్‌ ముందు భారత్‌ 399పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బుమ్రా వేసిన తొలిఓవర్‌ రెండో బంతికే ఓపెనర్‌ ఫించ్‌(3; 4బంతుల్లో) కోహ్లీ చేతికి చిక్కాడు. ప్రస్తుతం 135 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో బుమ్రా, జడేజా, షమీ చెరో వికెట్ పడగొట్టారు. విజయం సాధించాలంటే ఆసీస్ ఇంకా 264 పరుగులు సాధించాలి. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి.