తెరాసలోకి కేసీఆర్ ప్రత్యర్థి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. రేపు (శుక్రవారం) సాయంత్రం ఒంటేరు సీఎం కేసీఆర్ సమీక్షంలో తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి ఒంటేరుపై సీఎం కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి 2014లో తెలుగుదేశం తరఫున, 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌పై పోటీచేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. రెండు సందర్భాల్లోనూ కేసీఆర్ కి ఒంటేరు బలమైన అభ్యర్థిగా కనిపించారు. ఎన్నికలకి ముందు గజ్వేల్ లో ఒంటేరు కేసీఆర్ ని ఓడించబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఐతే, కేసీఆర్ ని రెండో దఫా గజ్వెల్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు.