పాత కథలో కొత్తదనం ఏం చూపిస్తారో.. !?

అఖిల్ అక్కినేని నటిస్తున్న మూడో చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ తో.. ఇది అఖిల్ కి సూటయ్యే కథ అనిపించింది. లవ్వర్ బోయ్ లక్షణాలున్న అఖిల్ ఇన్నాళ్లకి కరెక్ట్ కథని ఎంచుకొన్నాడని చెప్పుకొన్నారు. ఐతే, ట్రైలర్ రాకతో ముందున్న అభిప్రాయం చెడింది. ఈ రొమాంటి కథ రొటీన్ కథని ట్రైలర్ తో అర్థమైంది. ప్రేమిస్తాను.. కానీ పెళ్లి చేసుకోను.. ఈ లైన్ ఇప్పటిది కాదు. దాదాపు 2 దశాబ్దాలుగా చూస్తునే ఉన్నాం.

వేణు హీరోగా నటించిన ‘స్వయంవరం’ సినిమా కాన్సెప్ట్ ఇదే . రామ్ చరణ్ ‘ఆరెంజ్’, ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’ సినిమాది కూడా ఇదే యాంగిల్. ఇప్పుడు దాదాపు ఇలాంటి కాన్సెప్టుతోనే అఖిల్ మిస్టర్ మజ్ను తెరకెక్కింది. రొటీన్ కథైనా.. ఎమోషనల్ గా ఆకట్టుకుంటే మంచిదే. లేదంటే ‘మిస్టర్ మజ్ను’కి నిరాశ తప్పకపోవచ్చు. ఏదేమైనా.. అఖిల్ కొత్తదనం కోరుకొంటే మంచిదేమో.. !