మూడో వన్డేలోనూ భారత్ విజయం.. సిరీస్ కైవసం !

టీమిండియా విజయయాత్ర కొనసాగుతోంది. న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలోనూ 7 వికెట్ల తేడాతో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు వన్డేల సిరీస్ ని 3-0తో కైవసం చేసుకొంది.

మూడో వన్డేలో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన కివీస్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కివీస్ బ్యాట్స్ మెన్స్ లో టేలర్ 93, లాథమ్ 51పరుగులతో రాణించారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. షమి 3, భువనేశ్వర్, పాండ్యా, చహాల్ చెరో 2 వికెట్లు తీసుకొన్నారు. కివీస్‌ నిర్దేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీ సేన 43ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. విరాట్‌ కోహ్లీ (60), రోహిత్‌ శర్మ (62), రాయుడు (40 నాటౌట్‌), దినేశ్‌ కార్తీక్‌ (38 నాటౌట్‌) రాణించారు.