కోట్ల టీడీపీలో చేరికపై కేఈ షాకింగ్ కామెంట్


కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైంది. కోట్ల కుటుంబంలో కలిసి మరికొద్దిసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. కోట్ల కర్నూలు ఎంపీ టికెట్ తో పాటు ఆలూరు, ఆధోనీ నియోకవర్గాలని ఆశిస్తున్నట్టు సమాచారమ్. అవి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోట్ల టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఇక లాంచనమే.

మరోవైపు, కోట్ల టీడీపీలో చేరడంపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పందించారు. కోట్ల చేరికపై తనతో ఎవరూ చర్చించలేదు. తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు కేఈ. ఈ నేపథ్యంలో కోట్ల టీడీపీ చేరితే.. కేఈ టీడీపీ నుంచి బయటికొచ్చే అవకాశాలు లేకపోదనే కామెంట్స్ వినిపిస్తున్నారు. అలాకాకుండా కోట్ల, కేఈ ల మధ్య సీఎం చంద్రబాబు రాజీ కుదురుస్తారా.. ? అన్నది చూడాలి. ఆ ఉద్దేశమే చంద్రబాబుకు ఉంటే కోట్ల చేరికపై కేఈ కి ముందస్తు సమాచారం ఇచ్చేవారుగా. మొత్తంగా.. కోట్ల రాకతో కేఈ దెబ్బపడేలా కనబడుతోంది.