ఏపీలో మోడీ, అమిత్ షా పర్యటనలు ఖరారు


ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ పర్యటనలు ఖరారయ్యాయి. వచ్చే నెల 10న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గుంటూరులో పర్యటించనున్నారు. అంకంటే ముందే వచ్చే నెల 4న అమిత్‌ షా ఏపీ పర్యటన ఉండనుంది. షా మూడు విడతలుగా రాష్ట్రంలో పర్యటించనున్నారు. మోడీ, షా ఏపీ పర్యటన వివరాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాకు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కన్నా విమర్శలు గుప్పించారు. ‘‘చంద్రబాబు ప్రతి అంశాన్ని తానే చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో పోలవరానికి విహారయాత్రలు చేస్తున్నారు. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా కియా మోటార్స్‌ ప్రతినిధులతో ప్రధాని భేటీ అయ్యారు. అందులో భాగంగానే కియా మోటార్స్‌ రాష్ట్రానికి వచ్చింది. కియా అధికారులు రాష్ట్రానికి వచ్చినప్పుడు తెదేపా నాయకులు బెదిరించారు. ప్రధాని కార్యాలయం జోక్యంతో వ్యవహారం సద్దు మణిగింది. చెప్పుకోవడానికి ఏమీలేకే కేంద్రం చేసినవి సీఎం చెప్పుకుంటున్నారు’ అని కన్నా విమర్శించారు.