కివీస్ కసితీరా గెలిచింది

ఐదు వన్డేల సిరీస్ ని ఇప్పటికే టీమిండియా 3-0తేడాతో గెలిచేసుకొంది. ప్రతి మ్యాచ్ లోనూ కివీస్ ని సునాయసంగా ఓడించింది. ఇప్పుడీ కసినంతా కివీస్ ఆటగాళ్లు నాల్గో వన్డేలో చూపించారు. హామిల్టన్‌ వేదికగా జరిగిన నాల్గో వన్డేలో కివీస్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ ని 30.5 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌట్ చేసింది.

టీమిండియా ఆటగాళల్లో అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ డకౌట్ అయ్యారు. జాదవ్ 1, హార్థిక్ పాండ్యా 16, కుల్దీప్ యాదవ్ 15, యుజవేంద్ర చాహల్ 18 పరుగులు మాత్రమే చేశారు. న్యూజిలాండ్ బౌలింగ్‌లో బోల్ట్ 5, గ్రాండ్‌హోం 3, నీశమ్, ఆసెల్ తొలో వికెట్లు తీశారు. భారత్ నిర్ధేశించిన 93 స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అటు బ్యాట్స్‌మెన్‌, అటు బౌలర్లు టీమిండియాను కుదేలు చేసి న్యూజిలాండ్‌ సునాయాస విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 3-1తో కివీస్‌ బోణీ కొట్టింది.