పూరి కొడుకు ‘రొమాంటిక్’

దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి మూడో సినిమా ఖరారైంది. ఈ చిత్రానికి ‘రొమాంటిక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ స్క్రీన్‌ ప్లే, డైలాగులు, కథ అందించనున్నారు. ఆయన శిష్యుడు అనిల్‌ పాడూరి దర్శకత్వం వహించనున్నారు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై ఆయనే నిర్మాతగా వ్యవహరించనున్నారు.

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆయన తనయుడు హీరోగా చేసిన ‘మెహబూబా’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా తర్వాత కూడా పూరి దర్శకత్వంలోనే ఆకాష్ సినిమా ఉండబోతుందనే ప్రచారం జరిగింది. ఐతే, పూరి మాత్రం కథ అందించి.. దర్శకత్వ బాధ్యతలని ఆయన శిష్యుడు అనిల్ పాడూరికి అప్పగించారు. మరీ.. ఆకాష్ కి అనిల్ తొలి హిట్ ఇస్తాడేమో చూడాలి.