భారత్’పై పాక్ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు !

భారత్-పాక్ సరిహద్దులు యుద్ధ మేఘాలు కమ్ముకొన్నాయి. సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్‌ వాయుసేన యుద్ధవిమానాన్ని భారత్‌ దళాలు కూల్చివేశాయి. ఈ విమానం నౌషెరా సమీపంలోని పాక్‌ పరిధిలోకి వచ్చే లామ్‌ లోయలో కూలిపోయినట్లు సమాచారం.ఓ వైపు పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే.. మరోవైపు భారత్’పై ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయడం గమనార్హం.

తమ భూభాగంలో భారత్‌ దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్‌.. తాజా పరిస్థితులను ఐక్యరాజ్యసమితికి నివేదించింది. బాలాకోట్‌లో భారత వాయుసేన చేపట్టిన దాడులు ఆ దేశ శత్రుత్వ ధోరణికి నిదర్శనమని పాక్‌ ఆరోపించింది. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్‌కు పాక్ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్‌ ఖురేషీ లేఖ రాశారు.