‘మేజర్’ని విడుదల చేసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మేజర్’ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ తో కలిసి మహేష్ నిర్మాణ సంస్థ ‘జిఎంబి’ నిర్మిస్తున్న చిత్రమిది. అడవిశేష్ హీరోగా నటిస్తున్నారు. ‘గూఢచారి’ దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించనున్నారు. 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ ఇన్‌స్పిరేషన్‌తో ఈ సినిమాను తెరకెక్కినుంది. ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ని మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ సినిమాతో మహేష్ బాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. ఐతే, అది హీరోగా కాదు. నిర్మాతగా. మేజర్ తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కనుంది. ఇక, ఈ సినిమాతో సోనీ పిక్చర్స్ సంస్థ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ‘మేజర్’ శక్తివంతమైన కథ. సరిహద్దులను దాటి ఉన్న ఇండియన్స్‌ను ఇన్‌స్పైర్ చేసే చిత్రమిని చిత్రబృందం చెబుతోంది.