పాకిస్థాన్ అబద్దాలు ప్రచారం చేస్తోంది

గురువారం రాత్రి భారత త్రివిధ దళాల సంయుక్త మీడియా సమావేశం జరిగింది.సమావేశం అనంతరం ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ ఆర్జీకే కపూర్‌
మీడియాతో మాట్లాడారు. పాక్‌ దాడులను భారత్‌ తిప్పికొట్టింది. భారత సైన్యం మిగ్‌-21ను కోల్పోయింది. మన రెండు యుద్ధ విమానాలను కూల్చేశామని పాక్‌ చేస్తున్న ప్రచారం అవాస్తవం. ఒక్క విమానాన్నే కూల్చామని నిన్న సాయంత్రం పాక్‌ ఒప్పుకుందన్నారు.

ఎఫ్ 16 ను మొదట ఉపయోగించలేదని చెప్పిందని, అది కూడా అబద్దమని తేలిందన్నారు. ఇక భారత్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయలేదని మరో అబద్దం చెప్పిందని.. భారత్ అప్రమత్తంగా ఉండడం వలన కుట్రలను తిప్పికొట్టామన్నారు. భారత త్రివిధ దళాధిపతులు జల, వాయు, భూతాలలో త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని.. మా యుద్ధం ఉగ్రవాదంపైనేనని అది కొనసాగుతుందన్నారు ఆర్జీకే కపూర్‌.