‘ఆఫ్ సాహో-చాప్ట‌ర్ 2’


అతి తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది శ్రద్ధాకపూర్. ‘తీన్‌పత్తి’ సినిమాతో 2010లో బాలీవుడ్‌ తెరకు పరిచయమైంది.‘తుమ్‌ హీ హో’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.‘ఆషికి-2’తో కథానాయికగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. ఇప్పుడు ప్రభాస్‌ సరసన ‘సాహో’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకీ ప్రవేశిస్తోంది.

ఆదివారం తన 32వ ఏట అడుగుపెట్టబోతోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా..‘షేడ్స్ ఆఫ్ సాహో- చాప్ట‌ర్ 2’ పేరిట సరికొత్త టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ మొత్తం యాక్షన్ తో నింపేశారు. విలన్లతో ఛేజింగ్ లు , భారీ సెట్టింగ్లు , హెవీ యాక్షన్ తో నింపేశారు.