మళ్లీ.. మాయ చేస్తున్నారు.. !

జెస్సీ-కార్తీక్’ల లవ్ స్టోరీ సూపర్ హిట్. తెరపైనా, తెర బయట కూడా. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య-సమంత జంటగా నటించిన చిత్రం ‘ఏం మాయ చేశావె’. 2010 ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. చైతూ ఖాతాలో తొలి హిట్ అది. సమంతకి తొలి చిత్రం. ఈ సినిమా తర్వాత సామ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. షార్ట్ టైంలో స్టార్ హీరోయిన్ అయింది. ఈ సినిమాతో ప్రేక్షకులని మాయ చేయడమే కాదు.. చైతూ-సామ్ లు కూడా మాయలో పడిపోయారు. ప్రేమ మాయలో పడిపోయారు. పెళ్లి కూడా చేసుకొన్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న తొలి చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకుడు.

ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ఈ సినిమాలోని పోస్టర్స్ ‘ఏం మాయ చేశావె’ సినిమాని తలపిస్తున్నాయ్. మజిలీ’ నుండి రేపు (మంగళవారం) రెండో పాట ‘ప్రియతమా.. ప్రియతమా..’ రాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఇందులో సామ్-చై ‘ఏం మామ చేశావె’లో జెస్సీ-కార్తీక్ జంటలా కనిపిస్తున్నారు. దీంతో.. చై-సామ్ మళ్లీ మాయ చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.