ఫ్యాన్ క్రిందికి అలీ !

సినీ నటుడు అలీ పొలిటికల్ ప్రదక్షణలు ముగిశాయి. ఫైనల్ ఆయన ఫ్యాన్ గాలి క్రిందికి వెళ్లారు. వైకాపాలో చేరారు. సోమవారం లోటస్‌పాండ్‌లో జగన్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పి జగన్‌ తన పార్టీలోకి ఆహ్వానించారు.

పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయిన అలీ.. కొంత కాలంగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. నిన్న మొన్నటి వరకూ కూడా ఆయన తెదేపాలో చేరుతారని, గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఐతే, అలీ సడెన్ గా తన నిర్ణయాన్ని మార్చుకొని.. ఫ్యాన్ గాలి క్రిందికి వచ్చేశారు.

వైసీపీ చేరిన సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి లేదా విజయవాడ నుంచి టికెట్‌ ఇస్తే పోటీ చేస్తానని తెలిపారు. జనసేనలో ఎందుకు చేరలేదన్న విలేకర్ల ప్రశ్నకు ‘‘రాజకీయాలు వేరు.. ఫ్రెండ్‌షిప్‌ వేరు’’ అని సమాధానమిచ్చారు.