కాంగ్రెస్’కు మరో షాక్.. తెరాసలోకి సుధీర్ రెడ్డి !

తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెరాసలోకి క్యూ కడుతున్నారు. తాజాగా ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి తెరాసలో చేరడం ఖాయమైంది. శుక్రవారం సుధీర్ రెడ్ది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిశారు. అనంతరం తెరాసలో చేరబోతున్నట్టు తెలిపారు.

ప్రధానంగా హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కార్‌ చేపడుతున్న అభివృద్ధి పథకాలు తననెంతగానో ఆకర్షించాయి. ఎల్బీనగర్‌, బీఎన్‌రెడ్డి నగర్‌, వనస్థలిపురంలలో ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్‌ సమస్యలను పరిష్కరిస్తానని కేటీఆర్‌ హామీ ఇచ్చారని సుధీర్‌ రెడ్డి తెలిపారు. త్వరలోనే సుధీర్ రెడ్ది ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవనున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకోనున్నారు.అదికూడా చాలావేగంగా జరగనుందని తెలుస్తోంది.

ఇటీవల కాంగ్రెస్‌ నుంచి రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్‌, సబితా ఇంద్రారెడ్డి, కందాల ఉపేందర్‌ రెడ్డి ఇప్పటికే తెరాసలో చేరుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.