కొంచెం సమయం తీసుకున్నా.. సంతృప్తిగా చెందా !

నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం “ఓ బేబీ”. ‘ఎంత సక్కగున్నావే’ అనేది ఉపశీర్షిక. లక్ష్మి కీలక పాత్ర పోషిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆ విషయాన్ని సమంత ఇన్‌స్టగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైందంటూ ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమంత తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

“నాదైన దిశని కనుక్కోవడంలో నాకు సహాయం చేసిన దేవుడు, వ్యక్తుల పట్ల కృతజ్ఞతతో ఉంటా. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగడానికి నేను కొంచెం సమయం తీసుకున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. కానీ ఈ రోజు నా ఎదుగుదలపై సంతృప్తిగా ఉన్నా. దర్శకురాలు నందిని రెడ్డి నాకు ఇష్టమైన పాత్రని ఇచ్చారు” రాసుకొచ్చారు సమంత.

కొరియన్‌ చిత్రం ‘మిస్‌ గ్రానీ’ ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇందులో సమంత రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమా కంటే సామ్ నటించిన మజిలీ ప్రేక్షకుల ముందుకురానుంది. పెళ్లి తర్వాత సమంత, చైతూ జంటగా నటించిన చిత్రమిది. సినిమాలోనూ పెళ్లైన జంటగా కనిపించనున్నారు.