వైకాపా సింగిల్ కార్డ్ – 175మంది అభ్యర్థులతో జాబితా విడుదల


శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వైకాపా విడుదల చేసింది. మొత్తం 175 అభ్యర్థులను ఒకే జాబితాలో ఖరారు చేశారు. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో ఈ జాబితాను విడుదల చేశారు. అభ్యర్థుల జాబితాను సీనియర్‌ నేత ధర్మాన ప్రకటించారు. 40 మంది సిట్టింగులకి వైకాపా అవకాశం ఇచ్చింది. బీసీలకు 41 స్థానాలు, ఎస్సీలకు 29 స్థానాలు, ఎస్టీలకు 7 స్థానాలు, మైనారిటీలకు 5 స్థానాలని కేటాయించారు. 15 మంది మహిళలకు వైకాపా టికెట్లు కేటాయించింది.