నేడే లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌

లోక్‌సభ ఎన్నికల ఇవాళ నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 25వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఈనెల 21న హోలీ, 24 ఆదివారం.. సెలవు దినాలు కావడంతో ఆ రెండురోజులూ నామినేషన్ల స్వీకరణ ఉండదు. 26న నామినేషన్లని పరిశీలన ఉండనుంది. 27, 28 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండనుంది. ఏప్రిల్ 11న విడత పోలింగ్. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.