‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సెన్సార్ రిపోర్ట్

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో సంచలన విషయాలు చూపించబోతున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హిట్ ఇచ్చేశాడు.
ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతీ ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందనే విషయాలని సినిమాలో చూపించబోతున్నాడు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి, నందమూరి కుటుంబాన్ని ఆయన టార్గెట్ చేసినట్టు టీజర్, ట్రైలర్స్ చూస్తే అర్థమైంది.

సినిమాలో మరిన్ని సంచలన విషయాలని వర్మ ప్రస్తావించబోతున్నారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగింది. అందుకే లక్ష్మీస్ ఎన్ టీఆర్ కోసం ప్రేక్షకులు, సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ ఇవాళ జరగనుంది. సెన్సార్ బోర్డ్ కొత్త నిబంధల ప్రకారం.. క్యూ పద్దతిలో సినిమాలకి సెన్సార్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇవాళ లక్ష్మీస్ ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేయనిదే మరో సినిమాకు సెన్సార్ చేయకూడదు.

ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్ టీఆర్ కు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫిక్ ఇవ్వనుంది అనేది ఆసక్తిగా మారింది. దాంతో పాటు సినిమా టాక్ బయటికిరానుంది. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యుల అభిప్రాయాలు బయటికి లీకవుతుంటాయి. ఈ లెక్కన ఇవాళ లక్ష్మీస్ ఎన్ టీఆర్ సెన్సార్ రిపోర్ట్ తో పాటు.. ఆ సినిమా టాక్ తెలిసిపోనుంది.